జాబ్ రాలేదని మనస్తాపంతో విద్యార్థి మృతి

25 May, 2015 14:04 IST|Sakshi

హైదరాబాద్: హయత్‌నగర్ పరిధిలోని బాటసింగారం మౌంట్ ఓపెరా సమీపంలో తూర్పుగోదావరిజిల్లాకి చెందిన రోహిత్ కుమార్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జాబ్ రాకపోవటంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు