చిట్టీల పేరుతో ఘరానా మోసం

26 Jul, 2015 20:59 IST|Sakshi

హైదరాబాద్: నగరంలోని బోరబండ శివాజీనగర్లో చిట్టీల పేరుతో ఓ మహిళ కుచ్చుటోపి పెట్టింది. బాధితుల నుంచి కోటిన్నర వసూలు చేసి ఆ డబ్బుతో ఊడాయించింది. పుష్ప అనే మహిళ కొంతకాలంగా చిట్టీల పేరుతో వ్యాపారం చేస్తోంది. డబ్బు అందగానే చిన్నగా జారుకుంది.

తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు సనత్నగర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు