బీజేపీ కార్పొరేటర్ హత్య

25 Oct, 2014 18:42 IST|Sakshi

ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో మద్యం తాగుతున్న ఓ బీజేపీ కార్పొరేటర్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మహేష్ జైన్ (46) ఆగ్రా కార్పొరేషన్లో బీజేపీ చీఫ్ విప్గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రమోద్ జైన్, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆయన ఈద్గా కాలనీలో మద్యం తాగుతున్నారు.

ఇంతలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ప్రమోద్ జైన్ రివాల్వర్ నుంచే బుల్లెట్ బయటకు రావడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమోద్ సహా మరో ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ దాఖలుచేసి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు