న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ప్రీమియం సెడాన్ 520డి ఎం స్పోర్ట్స్ అప్డేటెడ్ వెర్షన్ను విడుదల చేసింది. దీని ఎక్స్షోరూం ధర రూ.54 లక్షలుగా (ఢిల్లీ ఎక్స్ షో రూం) కంపెనీ నిర్ణయించింది. దీని డీజిల్ వేరియంట్ కార్లు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ షిప్లలో లభిస్తాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆటోమొబైల్ చరిత్రలోనే ఎంఅనే బ్యాడ్జికి విశిష్ట స్థానం ఉందని.. ఇది మోటార్ స్పోర్ట్స్ను సూచిస్తాయని సంస్థ చెప్పింది. ఈ మోడల్ను చెన్నైలోని కంపెనీ ప్లాంట్లో తయారు చేస్తున్నట్టు తెలిపింది. సెడాన్ తెలివైన తేలికైన నిర్మాణం, ఆటో స్టార్ట్ స్టాప్, ఎకో ప్రో, రీతులు బ్రేక్ శక్తి పునరుత్పత్తి, 50:50 బరువు సహా ఎఫీషియంట్ డైనమిక్స్, ఇంధన పొదుపు సాంకేతికతలతో కూడి ఉందిని పేర్కొంది.
భారత్లో బీఎండబ్ల్యూ 5 సిరీసు తర్వాత అధ్యాయం 520డి ఎం స్పోర్ట్స్తో మొదలవుతుందని సంస్థ భారతీయ విభాగం అధ్యక్షుడు ఫ్రాంక్ స్కోల్డర్ తెలిపారు. ఈ కారుకు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 7.7సెకండ్లలో అందుకుంటుంది. 233 కిలోమీటర్ల అత్యధిక వేగంతో కార్ లవర్స్ ను ఆకర్షించనుందని సంస్థ పేర్కొంది.