సాక్షి, హైదరాబాద్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతో ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్సింగ్ మంగళవారం భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డితో కలసి ఆయన రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు. వీరు ముగ్గురే కొంతసేపు సమావేశమయ్యారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత, ఇతర ముఖ్యమైన అంశాలేమీ లేవని, కేవలం మర్యాదపూర్వకంగానే రామోజీరావును కలిసినట్లు దిగ్విజయ్ మీడియాకు వెల్లడించారు.