సీబీఎస్ఈలోనూ అమ్మాయిలదే హవా

25 May, 2015 13:22 IST|Sakshi
సీబీఎస్ఈలోనూ అమ్మాయిలదే హవా

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మొత్తం 82 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఉత్తీర్ణతలో బాలుర కంటే బాలికలు పైచేయి సాధించారు. బాలికలు 87.57 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

బాలురు 77.77 శాతం ఉత్తీర్ణత సాధించారు. 95.41 శాతం ఉత్తీర్ణత తిరువనంతపురం రీజియన్ రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది 1,040,368 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 1.2 శాతం ఎక్కవ.

మరిన్ని వార్తలు