జీవోఎం మళ్లీ భేటీ

5 Feb, 2014 20:13 IST|Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం మరోసారి సమావేశమైంది. మంగళవారం జరిగిన భేటీనే ఆఖరిదని వార్తలు వచ్చినా.. బుధవారం సాయంత్రం మళ్లీ సమావేశమైంది. నార్త్బ్లాక్లో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్ పాల్గొన్నారు.

సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, కిశోర్ చంద్రదేవ్, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, కిల్లి కృపారాణి పాల్గొన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించారు.

మరిన్ని వార్తలు