అవినీతి కేసు విచారణకు ఎనిమిదేళ్లు

7 Sep, 2015 09:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై విచారణ జరిపే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) కీలకమైన కేసుల నిర్ధారణకు ఎనిమిదేళ్లకుపైగా సమయం తీసుకుంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి ఏటా సుమారు 5 వేల మందిని ఈ కమిషన్ విచారిస్తుంది.

మొదటి, రెండో దశల్లో జరిగే ఈ విచారణలో కేసు గుర్తింపునకే దాదాపు రెండేళ్ల సమయం తీసుకుంటుందని అధ్యయనంలో వెల్లడైంది.  అలాగే కీలకమైన కేసుల్లో పలు జోక్యాలు కూడా ఉంటాయని వెల్లడించింది.

మరిన్ని వార్తలు