దాహం బాబోయ్‌ దాహం: జనాల్లోకి నల్లత్రాచు!

30 Mar, 2017 10:56 IST|Sakshi
దాహం బాబోయ్‌ దాహం: జనాల్లోకి నల్లత్రాచు!

కరువు కటకటలాడుతోంది. ఎక్కడ చూసినా తాగడానికి నీళ్లు లేవు. దీంతో దాహంతో అలమటించిపోయిన ఓ నల్లత్రాచు (కింగ్‌ కోబ్రా) ఏకంగా జనావాసాల్లోకి చొచ్చుకొచ్చింది. అదృష్టం బావుండి అది.. పాముల గురించి తెలిసిన ఓ వ్యక్తి కంట పడింది. దాహంతోనే అది అడవిని వదిలి గ్రామానికి వచ్చిందని గుర్తించిన ఓ వ్యక్తి స్థానిక అటవీ పోలీసుల సాయంతో ఆ నల్లత్రాచుకు నీళ్లు తాగించాడు. కర్ణాటకలోని కైగా టౌన్‌షిప్‌ సమీపంలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

ఈ ప్రాంతంలో కొంతకాలంగా కరువు తాండవిస్తున్నది. ఈ నేపథ్యంలో నీళ్లు దొరకక బాగా దాహంతో పాములు అప్పుడప్పుడు ఇలా జనావాసాల్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే దాహంతో అలమటించిన ఓ నల్లత్రాచు ఇటీవల జనావాసాల్లోకి వచ్చింది. పాములు పట్టే వ్యక్తి సాయంతో దానిని పట్టుకున్న స్థానిక పోలీసులు.. దానికి మినరల్‌ వాటర్‌ బాటిల్‌తో నీళ్లు తాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. నీళ్లు తాగించిన అనంతరం జంతు సంరక్షణ కేంద్రానికి ఆ నల్లత్రాచును తరలించారు.

మరిన్ని వార్తలు