ఉపాధి హామీ కూలీల ఆందోళన

28 Sep, 2015 13:47 IST|Sakshi

ఆదిలాబాద్(దండేపల్లి): దండేపల్లి మండలం రెబ్బనపల్లికి చెందిన ఉపాధి హామీ కూలీలు సోమవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటేందుకు తీసిన గుంతలకు సంబంధించి కూలీ డబ్బులు చెల్లించాలని కూలీలు ధర్నాచేశారు. పనులు చేసి 3 నెలలైనా బకాయిలు ఇంకా చెల్లించలేదని ఉపాధి హామీ సిబ్బందిని నిలదీశారు.

మరిన్ని వార్తలు