ఆర్థిక, రక్షణ శాఖలకు ఈసీ మందలింపు

29 Jan, 2017 08:22 IST|Sakshi
ఆర్థిక, రక్షణ శాఖలకు ఈసీ మందలింపు

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలవుతున్న సమయంలో తమ అనుమతిలేకుండా నిర్ణయాలు తీసుకున్న ఆర్థిక, రక్షణ శాఖల తీరును ఎన్నికల సంఘం తప్పుపట్టింది. తమ మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని కోరుతూ కేబినెట్‌ కార్యదర్శికి శుక్రవారం లేఖ రాసింది.

రక్షణ, ఆర్థిక శాఖలు, నీతి ఆయోగ్‌ ముఖ్య విషయాలను తమకు తెలియజేయలేదంది. తమ ఆమోదం పొందకుండానే బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీని ఆర్థిక శాఖ నిర్ణయించడంతో ఈసీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు