టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌

Published Sun, Jan 29 2017 8:31 AM

today news updates

హైదరాబాద్‌ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు హైదరాబాద్‌లో జరుగును. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా చర్చించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. ద్వారకా తిరుమలలో నిర్వహించే బహరంగసభలో ఆయన పాల్గొంటారు. వైఎస్ జగన్‌ సమక్షంలో మాజీ మంత్రి తనయుడు కోటగిరి శ్రీధర్, టీడీపీ మాజీ నేత ఎంఆర్‌డి బలరామ్ సహా పలువురు నేతలు పార్టీలో చేరనున్నారు.

తెలంగాణ : ఇవాళ తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశం హైదరాబాద్‌లో జరుగును. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఈ సమావేశానికి హాజరవుతారు.

ఢిల్లీ : నేడు ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం. దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ తన మనోభవాలను పంచుకుంటారు.
లక్నో : ఇవాళ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సంయుక్త ప్రెస్‌మీట్‌.
ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇవాళ పల్స్ పోలియో కార్యక్రమం. రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్ ముఖర్జీ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

స్పోర్ట్స్‌ : ఇవాళ భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టీ-20 మ్యాచ్‌. నాగ్‌పూర్‌ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్‌. ఇప్పటికే 1-0 అధిక్యంలో ఇంగ్లండ్.

స్పోర్ట్స్‌ : ఆస్ట్రేలియన్‌ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్న ఫెదరర్, నాదల్. మిక్స్‌డ్ డబుల్స్‌ ఫైనల్లో స్పియర్‌- కబాల్‌ జోడీతో తలపడనున్న సానియా-డోడిగ్ జోడీ.

Advertisement
Advertisement