జంట బాంబు పేలుళ్లు, 10 మందికిపైగా మృతి

21 Aug, 2016 18:12 IST|Sakshi

మొగదిషు: సొమాలియాలో ఆదివారం సంభవించిన జంట బాంబుపేలుళ్ల ఘటనలో పదిమందికి పైగా మరణించారు. గాల్కయో పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని రెండు కారు బాంబులను పేల్చారు. దాడి చేసింది తామేనని షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

దాడి జరిగిన ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. 12 మృతదేహాలను చూసినట్టు స్థానికుడు చెప్పాడు. అక్కడ భయానక వాతావరణం నెలకొంది. సొమాలియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిలటరీ, పౌరులను లక్ష్యంగా చేసుకుని షబాబ్ ఉగ్రవాద సంస్థ నిత్యం దాడులు చేస్తోంది.

>
మరిన్ని వార్తలు