డీఎండీకే పొత్తుపై ఎటువంటి చర్చ జరగలేదు:కరుణానిది

16 Jan, 2014 18:56 IST|Sakshi
డీఎండీకే పొత్తుపై ఎటువంటి చర్చ జరగలేదు:కరుణానిది

చెన్నై: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో డీఎండీకే పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై ఇప్పటి వరకూ ఎటువంటి చర్చ జరగలేదని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికలకు డీఎండీకేతో డీఎంకే పొత్తు పెట్టుకునే యోచనలో ఉందనే ఊహాగానాల నేపథ్యంలో కరుణ స్పందించారు. ఆ అంశంపై రెండు పార్టీల మధ్య అసలు మాటలే జరగలేదన్నారు. ఎన్నికల్లో మారుతున్న సమీకరణాల దృష్ట్యా ఇరు పార్టీల మధ్య పొత్తు అనే ఆలోచన ఆహ్వానించదగ్గ పరిణామమేనని పేర్కొన్నారు. కాగా వీటిపై ప్రస్తుతానికి నిర్ణయం తీసుకోలేదన్నారు. పొత్తు విషయాన్ని తన కుమారుడు అళిగిరి వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా అళిగిరి సోదరుడు స్టాలిన్ మాత్రం డీఎండీకే పొత్తుపై సానూకూలంగా ఉన్నారు.

మరిన్ని వార్తలు