-

ఢిల్లీలో ఏటీఎం నుంచి 39 లక్షల దోపిడీ

2 Aug, 2013 23:35 IST|Sakshi

దేశరాజధానిలో పట్టపగలు అందరూ చూస్తుండగానే ఏటీఎం సెంటర్ నుంచి 39 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. ఢిల్లీలోని మానస సరోవర్ పార్కు ప్రాంతంలో గల యూనియన్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు సెక్యూరిటీ సంస్థకు చెందిన సిబ్బంది ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వచ్చారు.

ఇంతలోనే మారుతి వ్యాగన్ ఆర్ కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. కారును కొద్దిదూరంలో ఆపి పెట్టుకుని తుపాకులతో వచ్చి గార్డు షహాబ్ సింగ్ (50)ను గాపరిచారు. అతడి వద్ద ఉన్న తుపాకిని కూడా లాక్కుని, లోపల సిబ్బందిని బెదిరించి వారి వద్ద ఉన్న మొత్తం 39 లక్షలను లాక్కుని తీసుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దుండగులను పట్టుకునేందుకు గాలింపు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు