బస్సు ప్రయాణికుడి నుంచి 59 లక్షలు స్వాధీనం

3 Sep, 2013 16:22 IST|Sakshi

చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఓ బస్సులో ప్రయాణికుడి నుంచి పోలీసులు దాదాపు 59 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తిరువళ్లూరు బస్టాండులో కాపు కాశారు.

ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ తనిఖీ చేయగా, అబూ బకర్ (52)  అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగులో ఏకంగా 59 లక్షల రూపాయలు దొరికాయి. అన్నీ వెయ్యి రూపాయల నోట్లేనని పోలీసులు తెలిపారు. కేరళలోని మళప్పురానికి చెందిన ఓ నగల వ్యాపారి చెన్నైలో వసూళ్లు చేసుకు రావాల్సిందిగా తనను పంపాడని, ఆ డబ్బునే తాను తీసుకెళ్తున్నానని అతడు పోలీసులకు విచారణలో తెలిపాడు. అయితే, ఇది హవాలా సొమ్ము కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో సదరు నగల వ్యాపారిని కూడా విచారణ నిమిత్తం చెన్నైకి పిలిపించారు.

మరిన్ని వార్తలు