-

చెత్తలో పేలుడు: ముగ్గురి మృతి

9 Jan, 2015 15:56 IST|Sakshi
మహారాష్ట్రలోని ఓ పవన విద్యుత్ ప్లాంటులో చెత్త తగలబెడుతుండగా అందులో ఉన్న జిలెటిస్ స్టిక్స్ పేలడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో్ నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని సతారాలో చోటుచేసుకుంది. 
 
ఉదయం 10  గంటల ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు ప్లాంటు ప్రాంగణంలో ఉన్న చెత్తను మండిస్తుండగా అందులోని జిలెటిన్ స్టిక్స్ పేలి  ప్రమాదం సంభవించిందని సతారా ఎస్పీ ఎ. దేశ్ముఖ్ తెలిపారు.  ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తులను సమీపంలోని సితార ఆస్పత్రికి తరలించామన్నారు.
మరిన్ని వార్తలు