సిట్ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి సరైన వసతులు కల్పించలేదని ఆయన తరఫు న్యాయవాదులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని సిట్ అదనపు కమిషనర్ స్వాతి లక్రా చెప్పారు.
సిట్ కార్యాలయంలో రేవంత్ రెడ్డికి భోజనం, మినరల్ వాటర్, పరిశుభ్రంగా పడుకునే వసతులు కల్పించినట్లు ఆమె చెప్పారు. ఆయనకు కొత్త బెడ్ షీట్లు, బెడ్లు ఏర్పాటు చేశామని, అన్ని సదుపాయాలు ఆయనకు ఉన్నాయని ఆమె వివరించారు.