ఏపీలో కొత్తగా 1,501 కరోనా కేసులు..

19 Aug, 2021 19:32 IST|Sakshi

సాక్షి,అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,501 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్‌ ప్రభావంతో  10  మంది మృతి చెందారు. తాజాగా  1,697మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 19,69,169మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,738యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారినపడి మొత్తం రాష్ట్రంలో 13,696మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,59,03,366 మందికి కరోనా పరీక్షలు  నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ  గురువారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

మరిన్ని వార్తలు