ఆరు లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసుల రాక

1 Jul, 2021 08:16 IST|Sakshi

విమానాశ్రయం(గన్నవరం): రాష్ట్రానికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. బుధవారం ఆరు లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరాయి. సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఈ వ్యాక్సిన్‌ డోసులను 50 బాక్స్‌ల్లో స్పైస్‌జెట్‌కు చెందిన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.50 గంటలకు ఇక్కడికి తరలించారు. అనంతరం వ్యాక్సిన్‌ డోసులను గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనంలో భద్రపరిచారు.
చదవండి: కోవిడ్‌: రాష్ట్రంలో జూలై 7వ తేదీ వరకు కర్ఫ్యూ

మరిన్ని వార్తలు