‘క్యాన్సర్‌ మానిటరింగ్‌’లో 353 పోస్టుల సృష్టి 

12 Oct, 2023 04:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ రంగంలోనే మెరుగైన, నాణ్యమైన క్యాన్సర్‌ వైద్య సేవల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలో విశాఖలో కేజీహెచ్, గుంటూరు జీజీహెచ్, కడప జీజీహెచ్‌లలో క్యాన్సర్‌ సెంటర్‌లతో పాటు, డీఎంఈ కార్యాలయంలో ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్‌ కోసం ప్రభుత్వం 353 పోస్టులను కొత్తగా సృష్టించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్‌ మం­జుల డి.హోస్మని ఉత్తర్వులిచ్చారు.

6 ప్రొఫెసర్, 5 అసోసియేట్, 14 అసిస్టెంట్‌ ప్రొఫెసర్, 90 స్టాఫ్‌ నర్స్, 90 జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌ చొప్పున, మిగిలిన వాటిలో ఇతర పోస్టులను కేటాయించారు. 50 కి.మీ దూరంలో క్యాన్సర్‌ వైద్యసేవలనుఅందు­బాటులోకి తెచ్చే­లా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. లెవ­ల్‌–1 క్యాన్సర్‌ సెంటర్‌గా గుంటూరును, లెవల్‌–2 సెంటర్‌లుగా కర్నూలు, విశాఖ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారు.    

మరిన్ని వార్తలు