ఏపీలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌

7 Jun, 2022 14:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఆమేరకు విధించిన బ్యాన్‌ను ఎత్తేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 8 నుంచి 17వరకు బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐదేళ్లకు పైబడిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పిస్తున్నారు. వ్యక్తిగత వినతులు, పరిపాలన సౌలభ్యం ఆధారంగా బదిలీలను చేపడుతున్నారు.

చదవండి: (CM YS Jagan: ట్రాక్టర్‌ నడిపిన సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు