రాజయ్యపేట తీరానికి కొట్టుకొచ్చిన భారీ పైపులైన్‌

30 May, 2022 14:11 IST|Sakshi

కేంద్ర రక్షణ శాఖకు చెందినదిగా గుర్తింపు

నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట సముద్రతీరానికి భారీ పై పులైను ఆదివారం కొట్టుకొచ్చింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ పైపులైను చూసి గ్రామస్తులకు సమాచారమిచ్చారు.  చాలామంది ఈ పైపులైనును ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించారు. కానీ భారీ పైపులైను కావడంతో కదపలేకపోయారు.


ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ డి.వెంకన్న రాజయ్యపేట సముద్రతీరానికి వెళ్లి పైపులైన్‌ను పరిశీలించారు. ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇది కేంద్ర రక్షణ శాఖ ఎస్‌.రాయవరం మండలం బంగారమ్మపాలెం సమీపంలో నిర్మిస్తున్న ఎన్‌ఏవోబీ (నేవల్‌ ఆల్టర్నేనేటివ్‌ బేస్‌)కు చెందిన పైపులైనుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నేవల్‌ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వనున్నట్లు ఎస్‌ఐ వెంకన్న తెలిపారు. (క్లిక్‌: మార్కాపురం వాసిని అభినందించిన ప్రధాని మోదీ)

మరిన్ని వార్తలు