కురబలకోట: చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో శనివారం జరిగిన గొర్రెల సంతలో కశ్మీర్ మేకపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరో వారంలో బక్రీద్ పండుగ రానుండడంతో వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద సంఖ్యలో మేలు జాతి మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు కొనేందుకు పోటీపడ్డారు. అయితే కశ్మీర్ మేకపోతులు ఒక్కోటి రూ.50 వేలపైన పలకడం విశేషం.