విజయనగరం: విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభధ్రస్వామి కరోనా బారిన పడ్డారు. శనివారం ఆయన కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలింది. రెండు రోజులుగా తనను కలిసిన వ్యక్తులు కూడా పరీక్షించుకోవాలని కోలగట్ల కోరారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.