పగటి ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలు నమోదు
విలవిల్లాడుతున్న చిన్నారులు, వృద్ధులు
అనకాపల్లి: భానుడు సెగలు కక్కుతున్నాడు. ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో 40.5 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఎండవేడి, ఉక్కపోత కారణంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం భయపడుతున్నారు. సాయంత్రం యలమంచిలి పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై, చిరుజల్లులు పడడంతో వాతావరణం చల్లబడింది.