-
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
సాక్షి, అనకాపల్లి: ఏపీలో ఓటమి తప్పదని భావించిన కూటమి నేతలు హత్యా రాజకీయాలకు తెరలేపారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి జరిగిన ఘటన మరువక ముందే తాజాగా మరో ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అనకాపల్లిలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడి హత్యకు కుట్ర జరిగినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం అనకాపల్లిలోని ఆయన స్వగ్రామం తారువలో ఉన్నారు. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు ఇంటి వద్ద కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. డ్రోన్ సాయంతో విజువల్స్ తీశారు. దీంతో, అనుమానం వచ్చి స్థానికులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆరా తీశారు. విజువల్స్ తీస్తున్న వారిని పట్టుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారు పొంతనలేని సమాధానం ఇచ్చారు.అనంతరం దేవరపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో వారు స్థానికులు కాదని పోలీసులకు తెలిపారు. దీంతో, ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద ఉన్న బీజేపీ కండువాలను, జెండాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అక్కడ డ్రోన్ను ఎందుకు ఎగురవేశారని ప్రశ్నించగా వారు సమాధానం చెప్పకోవడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు మాట్లాడుతూ.. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ముత్యాల నాయుడికి లభిస్తున్న ఆదరణను ఓర్వలేకనే బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
సీఎం జగన్ చోడవరం ప్రచారసభ.. జనసంద్రంగా కొత్తూరు జంక్షన్
గుంటూరు,సాక్షి: ఎన్నికల ప్రచార సభలో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి జిల్లా చోడవరం చేరుకున్నారు. కాసేపట్లో కొత్తూరు జంక్షన్లో జరగబోయే ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారాయన.అంతకు ముందు చోడవరం చేరుకున్న సీఎం జగన్కు పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే గణేష్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తదితరులు స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ కొత్తూరు జంక్షన్ కు బయలుదేరారు సీఎం జగన్. జన నేత రాక సందర్భంగా కొత్తూరు జంక్షన్ జనసంద్రంగా మారింది. -
గడ్డకట్టిన జలపాతంలో చిక్కుకుని తెలుగు విద్యార్థి దుర్మరణం
కిర్గిస్థాన్లో ఎంబీబీఎస్ విద్యార్థి దుర్మరణం పాలయ్యారు. గడ్డకట్టిన జలపాతంలో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్కు చెందిన 21 ఏళ్ల వైద్య విద్యార్థి దాసరి చందు కన్నుమూశారు. ఈ విషాద ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లికి చెందిన కిర్గిస్థాన్లో కిర్గిస్థాన్లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. యూనివర్సిటీలో పరీక్షలు ముగియడంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో నలుగురు విద్యార్థులతో కలిసి ఆదివారం జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లాడు. అయితే గడ్డకట్టిన నీడిలో చిక్కుకుని మృతి చెందాడు. తమ కుమారుడి మృతదేహాన్ని ఇంటికి చేరేలా సాయం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సంప్రదించినట్లు చందు తల్లిదండ్రులు తెలిపారు. కేంద్ర మంత్రి కిర్గిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, మృత దేహాన్ని అనకాపల్లికి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అనకాపల్లి ఎంపీ వెంకట సత్యవతి తెలిపారు. కాగా చందు తండ్రి అనకాపల్లిలో హల్వా అమ్మే భీమరాజు. భీమరాజు రెండో కుమారుడు చందు. -
కూటమికి ఫుల్ కోటింగ్..బాబు గుండెల్లో దడ..దడ..దడ..
-
Anakapalle Memantha Siddham: ‘మేమంతా సిద్ధం’ అంటున్న అనకాపల్లి జన సంద్రం (ఫోటోలు)
-
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ ఇలా
సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఉద్యమంలా కొసాగుతోంది. యాత్రలో భాగంగా సీఎం జగన్ పర్యటిస్తున్న ప్రాంతమంతా జన కెరటాన్ని తలపిస్తోంది. అడుగడుగునా జనం ప్రభంజనం మాదిరి కదిలివస్తోంది. జై జగన్ అంటూ ఉవ్వెత్తున నినాదిస్తున్నారు. మేమంతా సిద్ధం 19వ రోజు (ఏప్రిల్ 20) షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం విడుదల చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ శనివారం ఉదయం 9 గంటలకు గోడిచర్ల రాత్రి బస నుంచి బయలుదేరుతారు. నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3:30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నయపాలెం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
రాజధాని హంగులు..సరికొత్త సొబగులు
అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వానికీ మొరపెట్టుకున్నారు... ఓటేసి గెలిపించిన ప్రతి ప్రతినిధికీ వినతులు అందించారు. కాలం మారిపోయింది.. తరాలు తరిగిపోయాయి. కానీ.. జిల్లాను పట్టి పీడిస్తున్న సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ఇక ఆశలు వదిలేసుకున్న ప్రజలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త కాంతులు చూపించింది.ఎవరొచ్చినా తీరదనుకున్న సమస్యలకు సైతం పరిష్కారం లభించింది. అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. మామూలు జిల్లాగానే ఉండిపోతుందనుకున్న విశాఖకు రాజధాని యోగం పట్టింది. అందుకు అనుగుణంగా హంగులు సమకూరుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి, అల్లూరిజిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి, పర్యాటకం పరుగులు పెడుతున్నాయి. –సాక్షి, విశాఖపట్నం/అనకాపల్లి/పాడేరు నగరంలో రోడ్ల విస్తరణ తూర్పు నియోజకవర్గం పరిధి హనుమంతవాక నుంచి కైలాసగిరి కూడలి వరకు పదేళ్లుగా నిలిచిపోయిన రోడుŠడ్ విస్తరణ పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రారంభమయ్యాయి. దక్షిణ నియోజకవర్గంలో జగదాంబ జంక్షన్ నుంచి పాతనగరం వన్టౌన్ పోలీస్స్టేషన్ రాణిబోమ్మ వరకు 60 అడుగుల రోడ్డు విస్తరణ, అన్నవరం సత్యదేవుని ఆలయ ఘాట్ రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కొండవాలు ప్రాంతాల్లో రూ.9 కోట్లతో రక్షణ గోడలు నిరి్మంచారు. భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రంగిలో గోస్తనీ నదిపై రూ.16.50 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హౌసింగ్ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న గాజువాక హౌసింగ్ సొసైటీ భూములకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శాశ్వత పరిష్కారం చూపించారు. జీవో నంబర్ 301, 388 పట్టాదారులకు టైటిల్ డీడ్స్ అందజేశారు. సుమారు రూ.1500 కోట్ల విలువైన భూమిని ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన అందజేశారు. ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న 7026 మందికి కన్వేయషన్స్ డీడ్స్ అందించారు. 39 మంది ఉక్కు కర్మాగార నిర్వాసితులకు కన్వేయ¯న్స్ పట్టాలు, 40 మంది ఫార్మాసిటీ భూ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలందించారు. పారిశ్రామిక హబ్గా అనకాపల్లి జిల్లా ► కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లాలో ఒక వైపు సంక్షేమం, మరో వైపు నూతన పరిశ్రమల ఏర్పాటు ఊపందుకుంది. ► మాకవరపుపాలెం మండలం భీమబోయినపాలెంలో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మా ణం శరవేగంగా జరుగుతోంది. ► అనకాపల్లి మండలం కోడూరులో 70 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు కు స్థల సేకరణ పూర్తయింది. ► నక్కపల్లిలో డ్రగ్ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ► కోమళ్లపూడిలో మరో ఎస్ఈజెడ్కు స్థల కేటాయింపు పూర్తయింది. భారీ పరిశ్రమలకు శ్రీకారం రాజధానిగా రూపాంతరం చెందనున్న విశాఖపట్నంలో భారీ పరిశ్రమలు, ప్రాజెక్టుల స్థాపనకు మార్గం సుగమం చేశారు. అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. రూ.21,844 కోట్ల పెట్టుబడితో 39,815 మందికి ఉపాధి అవకాశాలు కలి్పంచేలా బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. ► గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఎనీ్టపీసీ, ఇంధన రంగంలో హెచ్పీసీఎల్, పర్యాటక రంగంలో ఒబెరాయ్, తాజ్, ఇనార్బిట్మాల్, టర్బో ఏవియేషన్.. వంటి బహుళ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. ► ఇన్ఫోసిస్, టెక్మహీంద్ర, హెచ్సీఎల్, యాక్సెంచర్, రాండ్స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్, అమేజాన్ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలు విశాఖ వైపు అడుగులు వేశాయి. మరో 48 ఐటీ సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. వీటితో పాటు 140కి పైగా స్టార్టప్లు నడుస్తున్నాయి. ► ఐదేళ్లలో జిల్లాలో 35 భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే ఇక్కడ 120 భారీ పరిశ్రమలున్నాయి. మొత్తం వీటన్నింటి ద్వారా 14,114 మందికి ఉద్యోగాలు. మారిన ఏజెన్సీ రూపు రేఖలు కొత్తగా ఏర్పాటైన అల్లూరి జిల్లాలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు నడవడానికి కూడా దారిలేని గిరిశిఖర గ్రామాలకు రోడ్డు సౌకర్యం కలిగింది. విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చాయి. ఐదేళ్ల పాలనలో సుమారు రూ.100 కోట్లతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాన రోడ్లను తారురోడ్లుగా మార్చారు. రూ.10 కోట్లతో జామిగుడ, గిన్నెలకోట గెడ్డలపై భారీ వంతెనలు నిర్మిస్తున్నారు. మిషన్ కనెక్ట్ పాడేరు పేరుతో రూ.100 కోట్ల ఉపాధి హా మీ పథకం నిధులతో రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ► పెదబయలు మండలంలోని ఇంజరి పంచాయతీలాంటి అత్యంత మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతానికి రూ.10 కోట్లతో తారురోడ్డు నిరి్మస్తున్నారు. ► రూ.500 కోట్లతో పాడేరులో మెడికల్ కళాశాల పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ► పాడేరు జిల్లా ఆస్పత్రి కార్పొరేట్ తరహాలో అభివృద్ధి చెందింది. చింతపల్లిలో రూ.20 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిరి్మస్తున్నారు. ఏజెన్సీ పర్యాటకం అద్భుతం ► అనంతగిరిలోని అంజోడ సిల్క్ ఫామ్లో పైన్ ప్లాంటేషన్ ఏర్పాటైంది. నీలగిరి చెట్లు పెరగడంతో అంజోడ పార్కు ఓ పర్యాటక ప్రాంతంగా మారింది. అక్కడ మంచు అందాలు కనువిందు చేస్తూ షూటింగులకు అనుకూలంగా మారింది. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సహకారంతో సుమారు రూ.70 లక్షలతో పార్కును ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ► బొర్రా గుహల వద్ద గోస్తనీ లోయపై పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన జిప్లైన్కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఏపీటీడీసీ సుమారు రూ.65 లక్షలతో ఇక్కడ సాహసక్రీడల్ని ఏర్పాటు చేసింది. ► ఏజెన్సీ నయాగరాగా చెప్పుకునే చాపరాయి జలపాతం వద్ద రూ.40 లక్షలతో కాటేజీలు, రోప్వేలు ఏర్పాటు చేశారు. -
వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా
-
అనకాపల్లి డీఎస్పీ ఎదుట విచారణకు సీఎం రమేష్ హాజరు
-
బెడిసికొట్టిన జనసేన మద్యం వ్యూహం
-
సీఎం రమేష్కు 41ఏ నోటీసులు జారీ..
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేష్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఇటీవల చోడవరంలో ఓ ఘటనలో కేసు నమోదు కాగా శనివారం నర్సీపట్నంలో కృష్ణా ప్యాలెస్లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యకర్తలకు చీరల పంపిణీ కార్యక్రమం వివాదానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న నర్సీపట్నం టౌన్ సీఐ క్రాంతి కుమార్, మున్సిపల్ కమిషనర్ రవిబాబుతో పాటు ఎన్నికల యంత్రాంగం అక్కడికి చేరుకుని తీయడంతో సీఎం రమేష్ అధికారులపై చిందులు తొక్కారు. ఓటర్లుకు సింబల్ తెలియజేయడానికి కమలం గుర్తు కలిగిన చీరలు ఇవ్వడం తప్పా అని ప్రశ్నించారు. ఇవి తాయిలాలు కాదని అధికారులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రమేష్కు 41ఏ నోటీసులు జారీ.. అనకాపల్లి జిల్లా చోడవరంలో జీఎస్టీ చెల్లించకుండా అనధికారికంగా టైల్స్ వ్యాపారం చేస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్లో తనిఖీలు నిర్వహిస్తున్న డీఆర్ఐ అధికారులపై దాడికి దిగడమే కాకుండా, విధులకు ఆటంకం కలిగించిన వ్యవహారంలో సీఎం రమేష్కు శనివారం రాత్రి పోటీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈనెల తొమ్మిదో తేదీన విచారణను హాజరు కావాలని అనకాపల్లి ఎస్డీపీవో ఆదేశించారు. కాగా, ఐపీసీలోని 353,342,506,201,188, 143/rw, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఎం రమేష్, చోడవరం టీడీపీ అభ్యర్థి రాజు సహా ఆరుగురి పేర్లను పోలీసుల ఎఫ్ఐఆర్లో చేర్చారు. -
సీఎం రమేష్ ‘పువ్వు’ చెవిలో పెట్టుకొని వెళ్లిపోవడమే: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చెయ్యడం కోసం ఏదైనా చేస్తానని అన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎన్నికల్లో పోటీలో ఎవరున్నారని పేదవాడికి కనిపించేంది సీఎం జగన్ మాత్రమేనని తెలిపారు. తమకు మంచి చేసిన వైఎస్ జగన్కే మళ్లీ ఓటువేసి గెలిపించాలని పేదవాడు అనుకుంటాడని పేర్కొన్నారు. సీఎం రమేష్ ఎంపీ నిధులను అనకాపల్లిలో ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టాడా అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ ఎక్కడి నుంచి వచ్చాడో అనకాపల్లి ప్రజలు గమనించాలని అన్నారు. బ్యాంకులకు కన్నం వేసి అనకాపల్లిలో తల దాచుకునేందుకు వచ్చాడని విమర్శించారు. రమేష్ ఆధార్ కార్డుపై మైదరాబాద్ అడ్రస్ ఉంటుందని దుయ్యబట్టారు. సీఎం రమేష్ ఎస్టీడీ.. బూడి ముత్యాలనాయుడు(అనకాపల్లి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి) లోకల్ అంటూ పేర్కొన్నారు. పువ్వు పార్టీ అనకాపల్లిలో గెలిచేది లేదని అమర్నాథ్ సెటైర్లు వేశారు సీఎం రమేష్ ఆ పువ్వు చెవిలో పెట్టుకొని వెళ్లిపోవడమేనని ఎద్దేవా చేశారు. అనకాపల్లిలో రాజకీయ శత్రువులను కలిపిందే తానంటూ కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావులను ఉద్ధేశిస్తూ అన్నారు. వాళ్ల ఇంట్లో తన ఫోటో పెట్టుకోవాలని అన్నారు. అలాంటి వారు తనమీద పడి ఏడుస్తున్నారని విమర్శించారు. -
ఎక్కడైనా, ఎవరినైనా డబ్బు కొట్టి లోబర్చుకోవడం ఆయన స్పెషల్
ప్రజల విశ్వాసం పొందిన రాజకీయ నాయకులు జీవితాంతం ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తుంటారు. కొందరు నాయకులు అయితే ప్రతి ఎన్నికకు నియోజకర్గాన్ని మారుస్తుంటారు. గెలిచిన చోట ప్రజలకు ఏమీచేయని వారు భయపడి మరో నియోజకవర్గం వెతుక్కుంటారు. టీడీపీలో ఓ నేత ఉన్నాడు. దక్షిణ కోస్తా నుంచి విశాఖకు వలస వచ్చి ఇక్కడ తిష్ట వేశాడు. ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గం, అధికారం కోసం పార్టీల మార్పిడి ఆయన నైజం. ప్రకాశం జిల్లా నుంచి విశాఖకు వలసవచ్చిన గంటా శ్రీనివాసరావు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి చివరికి పోర్టు కాంట్రాక్టర్గా అవతారం ఎత్తి వేల కోట్లకు పడగలెత్తారు. బాగా సంపాదించాక రాజకీయాలపై ఆసక్తి పెరిగి తెలుగుదేశంలో చేరి 1999లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. గెలిచాక నియోజకవర్గాన్ని పట్టించుకోని గంటా 2004లో అనకాపల్లి ఎంపీ సీటు వదిలేసి 2004లో చోడవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2009లో టీడీపీని వదిలేసి..ప్రజారాజ్యంలో చేరి ఈసారి అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయ్యాక అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పదవి అనుభవించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో అదృశ్యం కావడంతో మళ్ళీ టీడీపీ గూటికి చేరి ఈసారి భీమిలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. చదవండి: ఇవేం రాజకీయాలు? ఇదేం తీరు? రాజకీయాల్లోకి వచ్చాక జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ నాలుగు చోట్ల నుంచి గంటా పోటీ చేశారు. ఎక్కడైనా, ఎవరినైనా డబ్బు కొట్టి లోబర్చుకోవడం గంటా శ్రీనివాసరావు స్పెషల్ అని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. 2014లో భీమిలి నుంచి గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి కూడా అనుభవించిన గంటా శ్రీనివాసరావు అసలా నియోజకవర్గానికి ఎమ్మెల్యేను అన్న విషయమే మర్చిపోయారు. దీంతో భీమిలి అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. ఇక భీమిలిలో మళ్ళీ గెలిచే ఛాన్స్ లేదని అర్థం చేసుకున్న గంటా 2019లో విశాఖ సిటీలోని నార్త్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. 2019లో భీమిలిని వదిలేసి విశాఖ నార్త్లో పోటీ చేయాలని ముందుగానే నిర్ణయించుకున్న గంటా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు వేల సంఖ్యలో దొంగ ఓట్లను చేర్పించారు. అయినా సరే అత్తెసరు మెజార్టీతో విజయం సాధించారు. తనకున్న ఏరుదాటాక తెప్ప తగలేసే అలవాటు ప్రకారం విశాఖ నార్త్ నియోజకవర్గంను మర్చిపోయారు. ఐదేళ్ళ కాలంలో తనను గెలిపించిన ప్రజలకు కనీసం మొహం కూడా చూపించలేదు. కోవిడ్ మహమ్మారి విజృంభించినపుడు కూడా ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. గంటా శ్రీనివాసరావు కనిపిస్తే విశాఖ నార్త్ నియోజకవర్గంలో మొహం మీద ఉమ్మేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో గంటా ఈసారి మళ్లీ కొత్త నియోజకవర్గాన్ని వెతుక్కున్నారు. పదేళ్ళ క్రితం తనను గెలిపించిన భీమిలి నియోజకవర్గంపై మళ్ళీ కన్నేశారు. అక్కడి ప్రజలకు తనపై కోపం పోయింటుందని భావించి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కు వందల కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చి భీమిలి సీటు సంపాదించుకున్నారు. సీటు కొనుక్కోవడానికి ఎంతైనా పార్టీ ఫండ్ ఇవ్వడం.. గెలవడానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడం అలవాటైన గంటా శ్రీనివాసరావు భీమిలి ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి రెడీ అయ్యారు. అధికారం అడ్డం పెట్టుకొని బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర గంటా శ్రీనివాసరావుది. తీసుకున్న అప్పు.. వడ్డీతో కలిపి 400 కోట్ల రూపాయలకు చేరుకుంది. దీంతో గంటా తనకా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు ఇటీవల ఇండియన్ బ్యాంక్ నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు గంటాకు సీటు ఇవ్వడంపై భీమిలిలోని జనసేన, టిడిపిలో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. మొదట ఈ సీటు జనసేనకే అని ప్రకటించారు. దీంతో అక్కడి జనసేన నేతలు సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు గంటా చంద్రబాబు, పవన్లను డబ్బుతో కొట్టి సీటు తన్నుకుపోవడంతో భీమిలి నేతలు బహిరంగంగానే తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. జనసేన సీటు వచ్చిందని భావించి భంగపడ్డ పంచకర్ల సందీప్ ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఔ పవన్ తీరుతో జనసేన కార్యకర్తలమని చెప్పుకునేందుకే సిగ్గేస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పుడు భీమిలిలో గంటాకు..అటు టీడీపీ నుంచి..ఇటు జనసేన నుంచి సహాయ నిరాకరణ తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గంటాకు సీటు విషయంలో పునరాలోచన చేయకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని అక్కడి టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. -
ఒక రౌడీని గెలిపిస్తే అనకాపల్లి నాశనం అయిపోతుంది
-
సీఎం రమేష్పై కేసు నమోదు
విశాఖపట్నం, సాక్షి: కూటమి తరఫున అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. ‘‘నా సంగతి మీకు తెలియదంటూ..’’ జీఎస్టీ తనిఖీల కోసం వెళ్లిన డీఆర్ఐ(Directorate of Revenue Intelligence) అధికారులపై గుండాయిజం ప్రదర్శించారాయన. ఈ ఘటనపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ చోడవరం పీఎస్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. డీఆర్ఐ అధికారులకు ఆటంకం కలిగించడంతో పాటు వాళ్ల చేతుల్లో ఫైళ్లను లాక్కునే ప్రయత్నం చేశారు సీఎం రమేష్. దీంతో.. అధికారుల విధులకు ఆటంకం కలిగించే యత్నం చేశారని.. బెదిరింపులకు పాల్పడ్డారని చోడవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 143, 506, 342, 353, 201, 188 red with 149 కింద కేసు నమోదు చేశారు. సీఎం రమేష్తో పాటు చోడవరం టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు, టైల్స్ వ్యాపారి బుచ్చిరాజు, రామకృష్ణలతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు అయ్యింది. అసలేం జరిగిందంటే.. గాంధీ గ్రామంలో బుచ్చిరాజు అనే టీడీపీ సానుభూతిపరుడు హోల్సేల్ టైల్స్, మార్బుల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. దానిపై డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం(డీఆర్ఐ) అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరుగురితో కూడిన ఓ బృందం గురువారం తనిఖీలు నిర్వహిస్తోంది. జీఎస్టీ సక్రమంగా కట్టడం లేదంటూ షాపు రికార్డులన్నీ వారు తనిఖీ చేస్తుండగా టైల్స్ వ్యాపారి బుచ్చిరాజు స్థానిక టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజుకు, అనకాపల్లి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్కు ఫోన్ చేశారు. వెంటనే వారిద్దరూ తమ అనుచరులతో టైల్స్ షాపు దగ్గరకు చేరుకున్నారు. అధికారుల దగ్గర్నుంచి రికార్డులను సీఎం రమేష్ లాక్కున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా తనిఖీలు చేస్తారంటూ వారిపై దౌర్జన్యానికి దిగారు. అంతేనా అధికారులని కూడా చూడకుండా పరుషపదజాలంతో వారిపై విరుచుకుపడ్డారు. ఔ ఇదీ చదవండి: బ్యాంకుల మోసగాడు ఎంపీ అభ్యర్థా? -
అనకాపల్లి చోడవరంలో కూటమి అభ్యర్థి సీఎం రమేష్ దాదాగిరి
-
అనకాపల్లిలో సామాన్యుడు బలవంతుడికి మధ్య పోటీ- బూడి ముత్యాలనాయుడు
-
అనకాపల్లి జిల్లా పెందుర్తిలో వాలంటీర్ల రాజీనామా
-
‘ప్రజలు అన్నీ చూస్తున్నారు..’ వలంటీర్ల రాజీనామా
సాక్షి, అనకాపల్లి: ఓ అక్కా.. ఓ చెల్లి.. ఓ అవ్వా.. ఓ తాతా అంటూ ఒకటో తేదీన ఉదయాన్నే తలుపు తట్టి చిరునవ్వుతో ఫించన్ అందించే పరిస్థితికి బ్రేక్ పడింది. సీఎం జగన్ ఆలోచనల్లోంచి పుట్టి.. ఎండనకా వాననకా, ఆఖరికి కరోనాను సైతం లెక్క చేయకుండా నాలుగన్నరేళ్లు నిర్విరామంగా విధులు నిర్వహించారు వలంటీర్లు. అలాంటి వ్యవస్థకు ఆటంకాలు కలగజేయాలని కుట్ర కార్యరూపం దాల్చింది. పెన్షన్దారులు మండుటెండలో మళ్లీ క్యూలు కట్టాల్సిన పరిస్థితిని తెచ్చి పెట్టింది. 2019 అక్టోబర్ 2వ తేదీన పురుడుపోసుకున్న వలంటీర్ వ్యవస్థ ఇప్పుడు రాష్ట్రంలో బలంగా పాతుకుపోయింది. రెండున్నల లక్షల మందికిపైగా వలంటీర్లు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందటంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సుమారు 530 సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధాన కర్తలుగా, సంక్షేమ వారధులుగా వలంటీర్లను సీఎం జగన్ అభివర్ణిస్తుంటారు. అయితే.. ఈ నాలుగున్నరేళ్లలో వలంటీర్లను మానసికంగా వేధించే ప్రయత్నాలు జరిగాయి. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్కల్యాణ్, పలువురు టీడీపీ నేతలు.. ప్రజా సేవకులపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. అయినా అవమానాల్ని దిగమింగుకుని తమ సేవల్ని వలంటీర్లు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు.. ఈసీ కోడ్ పేరుతో తమ విధులకు విఘాతం కలిగించడాన్ని వలంటీర్లు భరించలేకపోతున్నారు. ఈ ఉదయం పెందుర్తి నియోజకవర్గంలో 23 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తానం గ్రామ వలంటీర్లు సాక్షితో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలలోకి తీసుకునే వెళ్ళే అదృష్టం సీఎం జగన్ మాకు ఇచ్చారు. కానీ, మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు మమ్మల్ని అనేక విధాలుగా మానసికంగా హింసించారు. పేదలకు, లబ్ధిదారులకు సేవ చేస్తుంటే.. స్లీపర్ సెల్స్ అని అపవాదు చేశారు. ఇప్పుడు ఇలా విధులకు ఆటంకాలు విధించారు. మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. అప్పుడే విధుల్లో చేరతాం’’ అని వలంటీర్లు శపథం చేశారు. ‘ ఏపీ ప్రజలు అన్ని చూస్తున్నారు.. మళ్లీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపించుకునే దిశగా అడుగులేస్తున్నారు’ అని వలంటీర్లు చెబుతున్నారిప్పుడు. పెందుర్తి పరిధిలోనే కాదు.. రాష్ట్రంలో పలుచోట్ల వలంటీర్లు స్వచ్ఛందంగా తమ విధులకు రాజీనామా చేస్తున్నట్లు తెలస్తోంది. -
పేదల సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత సీఎం జగన్ దే..
-
బీజేపీతో పేచీ తేలకపోవడంతోనే ఆయా సీట్లు పెండింగ్
-
Anakapalle: సొంతింటి కల నెరవేర్చిన ప్రభుత్వం
పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడం అంటే.. కేవలం వారు తలదాచుకోడానికి గూడు కల్పించడమే కాదు.. సమాజంలో సగౌరవంగా తలెత్తుకొని బతికేలా ఆత్మవిశ్వాసాన్ని కల్పించడమే. అందుకే.. సొంత ఇల్లు పేదల ఆత్మ గౌరవానికి సూచిక. మన అక్కచెల్లెమ్మలకు ఒక అన్నగా ఇస్తున్న కానుకే ఈ జగనన్న ఇల్లు’ -ఇదీ.. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బడుగుల ఆత్మ గౌరవానికి సౌధాలుగా చెప్పుకునే ఇంటి గురించి చెప్పిన మాటలు. ‘ఒక సెంటు భూమిలో ఇల్లు కట్టిస్తామని జగన్ చెబుతున్నాడు. ఆ సెంటు భూమి బరియల్ గ్రౌండ్కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎవరైనా చనిపోతే అందులో పూడ్చడానికి మాత్రమే ఈ సెంటు భూమిని ఉపయోగించవచ్చు’ -ఇవీ.. 40 ఏళ్లు సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పేదల సౌధాలపై చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు. నిజమే సెంటు స్థలంలో ఇల్లు చిన్నదే. కానీ.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన చంద్రబాబు.. ఎన్ని సెంట్ల స్థలాల్లో నిరుపేదలకు ఇళ్లు కట్టారో ఆయనకే ఎరుక. సాక్షి, అనకాపల్లి: సొంత ఇల్లు... పేదల ఆత్మగౌరవ సూచిక. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇంటి స్థలం కాగితం చేతికివ్వడం అంటే ఆత్మగౌరవ పతాకాన్ని వారి చేతికిచ్చినట్లే. ఎందరో అభాగ్యుల దుర్భర జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’పథకం వెలుగులు నింపుతోంది. ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో 58,626 మంది మహిళల పేరిట ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లను నిర్మింపజేస్తోంది. ఇదంతా ఉచితమే. పేదల మీద భారం లేకుండా సొంత ఇంటి కలను నిజం చేసే బాధ్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్నారు. ఒక్క రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వం వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. 682 లే అవుట్లలో నిర్మాణాలు అనకాపల్లి జిల్లాలో మొత్తం 682 లేఅవుట్లలో జగనన్న ఇళ్లు నిర్మిస్తున్నారు. 34,431 ఇళ్ల పట్టాలను ఉచితంగా పంపిణీ చేశారు. 24,195 మంది లబ్ధిదారులు తమ సొంత స్థలాల్లో నిర్మాణం చేపడుతున్నారు. అంతేకాకుండా ఒక్కో ఇంటికి రూ.30 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించింది. 18,738 ఇళ్లు పూర్తవ్వగా.. పురోగతిలో 36,029 ఇళ్లు ఉన్నాయి. పూర్తయిన ఇళ్లకు ఇప్పటివరకూ రూ.445.54 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం కల్పించే మౌలిక వసతుల వ్యయం కలిపితే ఇంటి స్థలం, ఇల్లు ఖరీదు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఈ కాలనీలు ఊర్లుగా రూపుదిద్దుకుంటున్నాయి. మెరుగైన జీవితం కోసం.. ఒక పేద కుటుంబం అన్ని సంక్షేమ పథకాలనూ అందుకుంటూ సొంత ఇంట్లో ఉంటే... మెరుగైన జీవితం వారికి తప్పకుండా దక్కుతుంది. ఆయా కుటుంబాల అభ్యున్నతికి బాటలు పడతాయి. దశాబ్దం తిరిగేసరికి... సమాజంలో గణనీయమైన మార్పు కచ్చితంగా కనిపిస్తుంది. అభివృద్ధికి నిర్వచనం... నేటి కంటే రేపు బాగుండటం అని వైఎస్ జగన్ పదేపదే చెబుతుంటారు. దానికి సాక్ష్యంగా ‘వైఎస్సార్ జగనన్న కాలనీలు’ సగర్వంగా తలెత్తుకుని నిలబడుతున్నాయి. సమగ్ర సౌకర్యాలతో... ళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షల ఆర్థిక సాయంతో పాటు డ్వాక్రా మహిళలకు రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు అందిస్తోంది. నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తోంది. సిమెంట్, స్టీల్ను రాయితీపై ఇస్తోంది. ఐఎస్ఐ మార్కు ఉన్న నాణ్యమైన సిమెంట్, స్టీల్, ఇతర వస్తువులను మార్కెట్ ధరల కంటే తక్కువకే అందిస్తోంది. కేవలం ఇళ్లను నిర్మించి ఇవ్వడమే కాకుండా.. పూర్తిస్థాయి సౌకర్యాల్ని ప్రభుత్వం కల్పిస్తోంది. సీసీ రోడ్లు, తాగునీటి సరఫరా పైపులైన్లు, భూగర్భ డ్రెయినేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు అన్ని కాలనీల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికీ భూగర్భ కేబుళ్లు వేస్తున్నారు. పేదలకు ‘క్వాలిటీ లైఫ్’ అందించడానికి ప్రభుత్వం చేపట్టిన మహాయజ్ఞంలా నిర్మాణాలు సాగుతున్నాయి. బాబు హయాంలో బేల చూపులే... 14 సంవత్సరాల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడు పేదల గురించి ఆలోచించలేదు. అధికారంలో ఉన్నప్పుడు.. సీఎం స్థాయి నుంచి జన్మభూమి కమిటీ వరకూ దోచుకునేందుకు ఎక్కడ దారి దొరుకుతుందో చూడటమే తప్ప.. పేద ప్రజలకు ఒక గూడు ఇద్దామన్న ఆలోచనే వారికి కనిపించలేదు. 2014లో హుద్హుద్ ధాటికి వేల మంది ప్రజలు ఇళ్లు కోల్పోయారు. 2016 ఏప్రిల్ నాటికి బాధితులకు ఇళ్లు అప్పగిస్తామని చెప్పారు. 2019 ఎన్నికలు వచ్చేంత వరకూ కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేకపోయారు. బాధితుల జాబితా అధికారుల వద్ద ఉన్నా.. దానితో సంబంధం లేకుండా టీడీపీ జన్మభూమి కమిటీలే అర్హుల జాబితాని సిద్ధం చేశాయి. ఇళ్ల కేటాయింపులో 80 శాతం వరకూ టీడీపీ కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యమిచ్చారు. ఇతర పార్టీల వారు బాధితుల జాబితాలో ఉన్నా.. వారిని పక్కకు తప్పించారు. ఇలా ఒక్క ఇంటిని కూడా నిరుపేదకు ఇవ్వని చరిత్ర తెలుగుదేశం పార్టీది. సొంతిల్లు.. చీకూచింతా లేని జీవితం నా పేరు వారాది కృష్ణవేణి, నేను ఒంటరి మహిళను. అనకాపల్లి మండలంలోని రేబాక గ్రామంలో నా తల్లితో కలిసి ఉండేదాన్ని. నా తల్లి మరణించాక చాలా కాలం నుంచి ఒంటరి బతుకే నాది. గత ప్రభుత్వంలో బతుకు చాలా భారంగా ఉండేది. జగనన్న ప్రభుత్వంలో నా కష్టాలన్నీ తీరాయి. మా ఊరికి చేరువగానే జగనన్న లేఅవుట్ వేశారు. నాకు సొంతిల్లు లేదని తెలుసుకున్న మా వలంటీర్ నా ఆధార్, ఇతర వివరాలతో మా ఊరి సచివాలయంలో దరఖాస్తు పెట్టారు. రోడ్డుకు ఆనుకుని లేఅవుట్లో ముందు వరుసలోనే నా పేరున స్థలం మంజూరైంది. వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాను. సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ వచ్చి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫోటోలు తీసుకునేవారు. నిర్మాణ దశల మేరకు నాలుగు విడతల్లో బి ల్లును నా బ్యాంకు ఖా తాలో జమ చేశారు. ఇసు క, సిమెంట్, ఇనుముతో కలిపి మొత్తం రూ.లక్షా, 80 వేలు లబ్ధి చేకూరింది. దీంతో చాలా వేగంగా నా ఇంటి పనులు పూర్తి చేసుకున్నా. ఇప్పుడు జగనన్న ఇచ్చిన స్థలంలో నిర్మించుకున్న ఇంటిలోనే ధైర్యంగా బతుకుతున్నా. పేదల కోసం ఆలోచించే మనసున్న నాయకుడు జగనన్న. ఈ ప్రభుత్వం నన్ను ఓ ఇంటికి యజమానికి చేసింది. ప్రతి నెలా ఒకటో తేదీనే ఒంటరి మహిళ పింఛన్ ఇంటికే వచ్చి వలంటీర్ అందిస్తున్నారు. జగనన్న దయతో ఎలాంటి చీకూచింత లేకుండా సంతోషంగా బతుకుతున్నా. పాకల్లో బతుకులు.. పక్కా ఇంటికి మాది చోడారం మండలంలోని సాయిపల్లి (చాకిపల్లి). నా పేరు పోలేపల్లి లచ్చిమి. మాది సేనా పేద కుటుంబం. నేను, మా ఆయన అప్పలనాయుడు కూలి పనులకు, సెరువు పనికి ఎల్తాం. రోజూ పనికెల్లకపోతే పూట గడివని బతుకులు మావి. మాకు ఇద్దరు పిల్లలు. మా కష్టం మీదే ఆల్లని పోసించుకోవాల. సొంతంగా నాణ్ణెమైన ఇల్లు లేదు. దీంతో పూరిపాకలోనే ఉంతన్నాం. కూలాడితే గానీ కుండాడని మాలాంటోళ్లం సొంతిల్లు కట్టుకోగలమా. ఎన్ని పెబుత్వాలు మారినా మా బతుకులు పాకల్లోనే గడిసిపోతాయనుకునేటోళ్లం. జగనన్న సీఎం అయ్యాక మాలాంటోళ్ల బతుకుల్లో వెలుగులొచ్చాయి. మా ఊర్లో సచివాలయం ఆపీసోళ్లు, వలంటీరు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి మా పేర్లు రాసుకెళ్లారు. ఇల్లు లేనోళ్లకి ఇంటి స్థలాలు ఇచ్చారు. కొన్ని రోజులకి మా ఊరు చివర్లో ఏసిన జగనన్న కోలనీలో మాకూ ఓ స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకోడానికి లచ్చా ఎనబయ్యేల రూపాయలు, సిమెంటు, తలుపులు, కిటికీలు, దారమందాలు, కరెంటు సామాన్లు అన్నీ ఇచ్చారు. దానికితోడు మావు కష్టపడి దాచుకున్న కొంత డబ్బు జతచేసి మా తాహతు మేరకు ఇల్లు కట్టుకున్నాం. జగనన్న దయవల్ల మాకూ సొంతగూడు ఏర్పడింది. ఇపుడు మీరెక్కడుంతన్నారని మా సుట్టాలడిగితే సాయిపల్లి జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకొని ఉంతన్నామని ధైర్నెంగా సెప్తున్నాం. జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. నెరవేరిన సొంతింటి కల నా పేరు పోలమూరి సత్యవతి. మాది మునగపాకలోని తిమ్మరాజుపేట. నేను గృహిణిని. నా భర్త బాబూరావు స్థానిక హైస్కూల్లో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం మాది. ఇద్దరు సంతానం. అమ్మాయికి పెళ్లి చేశాం. కొడుకు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మాకు సొంతిల్లు లేదు. ఇరవయ్యేళ్లుగా అద్దె ఇళ్లలోనే ఉంటున్నాం. చాలా సార్లు అద్దె చెల్లించేందుకు మేం పడ్డ కష్టాలు మర్చిపోలేం. గత ప్రభుత్వ హయాంలో సొంతింటి కోసం పనులు మానుకుని తిరగడం తప్ప ఫలితం లేకపోయింది. ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట మేరకు వలంటీరే మా ఇంటికొచ్చి, అవసరమైన పత్రాలు తీసుకుని సచివాలయంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేశారు. వెంటనే నాకు ఇంటి పట్టా మంజూరు చేశారు. అధికారులు స్వయంగా వచ్చి హద్దులతో సహా స్థలం చూపించి, మాకు అప్పగించారు. ఆ స్థలంలోనే ఇల్లు కట్టుకున్నా. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.లక్షా 80 వేలు సాయం అందించింది. దీనికి తోడు ప్రభుత్వం ద్వారా వివిధ సంక్షేమ పథకాల రూపంలో కలిగిన లబ్ధి, ఇతరుల నుంచి కొంత అప్పు తీసుకుని సొంతింటి కల నెరవేర్చుకున్నాం. సీఎం జగన్ పుణ్యమా అని ఏళ్లనాటి కల నెరవేరింది. మాకంటూ శాశ్వత చిరునామా వచ్చిందంటే జగనన్న చలవే. మాలాంటి పేదోళ్లకు మేలు జరగాలంటే మళ్లీ మళ్లీ జగనే సీఎం కావాలి. -
పైల ప్రసాద్ కు టికెట్ ఇస్తే టీడీపీకి మూకుమ్మడి రాజీనామా
-
అనకాపల్లి ఎంపీ టికెట్పై త్వరలో నిర్ణయం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని సభలో భద్రతా వైఫల్యానికి ఏపీ ప్రభుత్వానిదే బాధ్యతంటూ ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై వైఎస్సార్సీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని.. కూటమి చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారాయన. అలాగే అనకాపల్లి ఎంపీ టికెట్ అభ్యర్థి పెండింగ్లో ఉండడంపైనా ఆయన స్పష్టత ఇచ్చారు. విశాఖలో మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పెండింగ్లో ఉంచిన అనకాపల్లి అభ్యర్థి విషయంలో ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. త్వరలోనే నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తాం. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కదా అని పేర్కొన్నారాయన. అలాగే.. ఈనెల 27 నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని.. సిద్ధం సభలు జరగని ప్రతీ జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తారని సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారు. ‘‘అన్ని ప్రాంతాల్లో బస్సు యాత్ర నిర్వహణపై కసరత్తు చేస్తున్నాం. టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది’’ అని పేర్కొన్నారాయన. ఇక చిలకలూరిపేట ప్రజాగళంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. ‘‘వాళ్లు కూటమిగా ఏర్పడి మొదటిసారి మీటింగ్ పెట్టకున్నారు. వాళ్లు ఎంతమందిని పిలిచారో.. ఏం చేశారో మనకు తెలియదు. దేశ ప్రధానికి ప్రోటోకాల్ను అనుసరించే భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేశాం’’ అని ఆయన అన్నారు. మా నాయకుడు జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు త్వరలోనే బస్సు యాత్ర చేస్తారు. ఎవరు ఏ పక్కన నిలబడ్డారు.. ఏ పార్టీ ఏఏ సంక్షేమ పథకాలు తీసుకొచ్చాయి అనేదానిని ప్రజలు ప్రతీ ఒక్కటి గమనిస్తుంటారు. త్వరలో వాళ్ల ఓటు ద్వారా తీర్పు ఇస్తారు అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి గండి రవికుమార్
సాక్షి, గుంటూరు: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ.. రాజకీయ వలసలు పెరిగిపోతున్నాయి. తాజాగా.. అనకాపల్లి జిల్లాలో తెలుగు దేశం పార్టీకి మరో షాక్ తగిలింది. పెందుర్తి నేత గండి రవికుమార్ టీడీపీని వీడారు. బుధవారం మధ్యాహ్నాం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాయన. గండి రవికుమార్తో పాటు స్థానిక టీడీపీ నేత ప్రసాదరావులకు సీఎం జగన్ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్రాజ్, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ భగవాన్ జయరామ్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు
భైంసా రోడ్షోలో ఉద్రిక్తత
ఎన్నికలకు సర్వం సిద్ధం
అకాల వర్షం.. అన్నదాతకు నష్టం
సమయం లేదు మిత్రమా..
● అరచేతిలో వైకుంఠం చూపిన రేవంత్.. ● రూ.2,500, తులం బంగారం ఇచ్చిండా.. ● రూ.2 లక్షల రుణమాఫీ చేసిండా.. ● తెలంగాణలో బీజేపీని అడ్డుకునేది బీఆర్ఎస్సే ● నిర్మల్ కార్నర్ మీటింగ్లో కేటీఆర్
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ఫోన్ పోతే ఆందోళన వద్దు
ఆత్రం సుగుణను గెలిపించాలి
నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి
తప్పక చదవండి
- రొమాంటిక్ సీన్స్.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్
- ‘అద్భుతం కంటే తక్కువేం కాదు’.. కేజ్రీకు మద్యంతర బెయిల్పై
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement