కోనసీమ జిల్లాలో మహిళలపై తేనెటీగల దాడి

20 Nov, 2022 17:37 IST|Sakshi

సాక్షి, కోనసీమ జిల్లా: ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో తేనెటీగల దాడిలో 25 మంది గాయపడ్డారు. అందులో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం.

వన భోజనాలు కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని రావులపాలెం ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
చదవండి: రూమ్‌కు తీసుకెళ్లి రోల్డ్‌గోల్డ్‌ ఉంగరం తొడిగి.. పెళ్లయిపోయిందని నమ్మించి..

మరిన్ని వార్తలు