సాక్షి, విశాఖపట్నం: వాహనమిత్ర సభకు వెళ్లే ముందు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి జగన్ ఖాకీ చొక్కా ధరించి ఆటో ఎక్కి స్టీరింగ్ పట్టుకున్నారు. ఆటో డ్రైవర్లను ఆత్మీయంగా పలుకరిస్తూ యోగ క్షేమాలను విచారించారు. అనంతరం వేదిక వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ వాహనమిత్ర ఆటో, రహదారి భద్రత – జీవితానికి రక్ష, అభయం స్టాల్స్ను పరిశీలించారు. అక్కడకు వచ్చిన పలువురు వాహనమిత్ర లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ఫొటోలు దిగారు.
చదవండి: నలుగురు ధనికులు, దత్తపుత్రుడి కోసం నడిచే సర్కారు కాదిది: సీఎం జగన్