గుంటూరు జిల్లా పెదతురకపాలెం సర్పంచ్గా ఆరిఫ్బాషా
ప్రత్యర్థులకు సింగిల్ డిజిట్టే..
సాక్షి, నరసరావుపేట రూరల్: ఆ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. వైఎస్సార్సీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి పూర్తి ఏకపక్షంగా విజయబావుటా ఎగురవేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెదతురకపాలెం సర్పంచ్గా షేక్ ఆరిఫ్బాషా తన సమీప ప్రత్యర్థిపై 607 ఓట్ల రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించారు. శనివారం జరిగిన పోలింగ్లో మొత్తం 639 ఓట్లు పోలవగా, వాటిలో ఆరిఫ్బాషాకు 616 ఓట్లొచ్చాయి. మిగిలిన నలుగురు అభ్యర్థుల్లో అత్యధికంగా ఓట్లు పొందిన అభ్యర్థి(సమీప ప్రత్యర్థి)కి వచ్చిన ఓట్లు 9. మొత్తం 8 వార్డుల్లో ఐదు వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన మూడు వార్డులకు జరిగిన పోలింగ్లో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. చదవండి: (పల్లెల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం)