బైక్‌లు ఢీ : వ్యక్తికి గాయాలు

2 Jun, 2023 00:22 IST|Sakshi

మదనపల్లె : ద్విచక్రవాహనాలు ఢీకొని ఓ వ్యక్తి గాయపడిన సంఘటన గురువారం మదనపల్లె పట్టణంలో జరిగింది. పీఅండ్‌టీ కాలనీ వెంకటరమణారెడ్డి(63) ద్విచక్రవాహనంలో మల్లికార్జున సర్కిల్‌వైపు వస్తుండగా జిల్లా ఆస్పత్రి ఎదురుగా మరో ద్విచక్రవాహనం యూటర్న్‌ తీసుకోవడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో వెంకటరమణారెడ్డి గాయపడ్డాడు. అతనికి స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందించారు.

ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి

తంబళ్లపల్లె : తంబళ్లపల్లె మండలం రెడ్డికోట సమీపంలో లారీ–కారు ఢీ కొన్న ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మణికంఠ గురువారం మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు గత నెల 21న చింతామణికి కారులో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా మదనపల్లె–రాయచోటి రహదారిలో రెడ్డికోట బస్టాప్‌ సమీపంలో సిమెంట్‌ లారీ కారును ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ రెడ్డిశేఖర్‌ మృతి చెందగా , తీవ్రంగా గాయపడిన మణికంఠను తిరుపతికి,పెద్దయ్యను బెంగళూరుకు రెఫర్‌ చేశారు. ఈ క్రమంలో గురువారం రుయాలో చికిత్స పొందుతున్న మణికంఠ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు