బొలెరో ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు | Sakshi
Sakshi News home page

బొలెరో ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు

Published Sun, Nov 19 2023 1:46 AM

సంఘటన స్థలంలో బాధితులకు సపర్యలు చేస్తున్న స్థానికులు - Sakshi

చిన్నమండెం : మండలంలోని కడప–బెంగళూరు జాతీయ రహదారిపై మల్లూరు క్రాస్‌ వద్ద బొలెరో వాహనానికి టైర్‌ పగిలి ద్విచక్రవాహనాన్ని ఢీకొనగా ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు హెడ్‌కానిస్టేబుల్‌ ఓబులేసు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. చిన్నమండెం మండలం కేశాపురం కస్పాకు చెందిన చింతం సోమశేఖర్‌, అతని కుమారుడు సునీల్‌కుమార్‌రెడ్డి, మరో అతను వెంకటరెడ్డిలు ముగ్గురు రాయచోటి నుంచి కేశాపురం వస్తున్నారన్నారు. గుర్రంకొండ నుంచి రాయచోటి వైపు వస్తున్న బొలెరో వాహనం మల్లూరు క్రాస్‌ వద్దకు రాగానే.. టైరు పగిలి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటరెడ్డి, సోమశేఖర్‌, వెంకటరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ ఓబులేసు తెలిపారు.

Advertisement
Advertisement