ముంబై : గతేడాది చివర్లో వరుస నష్టాలు, కరెక్షన్లతో ఇన్వెస్టర్ల గుండెల్లో గుబులు పుట్టించిన స్టాక్ మార్కెట్ కొత్త ఏడాదిలో సంబరాలు పంచుతోంది. వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్ లాభాలతో మొదలైంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వెలువడిన నివేదికలు ఇండియా ఎకానమీ కోలుకుంటుందంటూ తేల్చి చెప్పడం, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి పెట్టుబడులకు రెడీ కావడంతో మార్కెట్లో సూచీలు పైపైకి వెళ్తున్నాయి.
ఈ రోజు ఉదయం 9:15 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 160 పాయింట్లు లాభపడి 59,343 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిన్నటి తరహాలోనే రోజంతా లాభాలు కొనసాగితే ఇవాల లేదా రేపు సెనెక్స్ మరోసారి 60 వేల పాయింట్లను టచ్ చేసే అవకాశం ఉంది. ఇక నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 17,681 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.