ఎలాన్‌ మస్క్‌ మరో సంచలనం! ఫుట్‌బాల్‌ టీమ్‌ను కొంటున్నా!

17 Aug, 2022 09:26 IST|Sakshi

మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ కొనుగోలుపై టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ వెనక్కి తగ‍్గారు. 44 బిలియన్ డాలర్ల కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకోవడంతో మస్క్‌పై ట్విట్టర్‌ చట్టపరమైన పోరాటానికి దిగింది. ఈ నేపథ్యంలో మస్క్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లీష్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ టీం మాంచెస్టర్‌ యూనైటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. 

ట్విట్టర్‌లో యాక్టీవ్‌గా ఉండే ఎలాన్‌ మస్క్‌ తాజాగా అమెరికన్‌ పాలిటిక్స్‌పై ట్వీట్‌ చేశారు. నేను రిపబ్లికన్,డెమోక్రటిక్ ఈ రెండు పార్టీలకు మద్దతు ఇస్తున్నాని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కొద్ది సేపటికే ఫుట్‌బాట్‌ టీం మాంచెస్టర్‌ యూనైటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ట్వీట్‌లో వెల్లడించారు. ప్రస్తుతం మస్క్‌ నిర్ణయం బిజినెస్‌ వరల్డ్‌లో మరింత ఆసక్తికరంగా మారింది. ట్విట్టర్‌ కొనుగోలుపై విచారణ జరుగుతుండగా ఈ బిజినెస్‌ టైకూన్‌ నిర్ణయం సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

చదవండి👉  'టెన్షన్ వద్దు..నేను ఏదో ఒకటి చేస్తాలే' ఆనంద్‌ మహీంద్రా రీ ట్వీట్‌ వైరల్‌!

మరిన్ని వార్తలు