ఎయిర్‌ ఇండియా ఉద్యోగులకు కొత్త యూనిఫాం

29 Sep, 2023 05:27 IST|Sakshi

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా సిబ్బందికి త్వరలో కొత్త యూనిఫాం రానుంది. ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ఈ యూనిఫామ్స్‌ను డిజైన్‌ చేయనున్నారు. 10,000లకుపైగా ఉన్న ఫ్లయిట్‌ క్రూ, గ్రౌండ్‌ స్టాఫ్, సెక్యూరిటీ ఉద్యోగులు 2023 చివరినాటికి నూతన డ్రెస్‌లో దర్శనమీయనున్నారు.

ఎయిర్‌ ఇండియాలో కొనసాగుతున్న ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా ఇది మరో అడుగు అని సంస్థ తెలిపింది.

మరిన్ని వార్తలు