ఇప్పుడు పేటీఎంలో బస్ టికెట్ కొంటే ఆఫర్లే.. ఆఫర్లు!

13 Apr, 2023 07:02 IST|Sakshi

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌ (బిహు, వైశాఖి) పురస్కరించుకుని ఆర్థిక సేవల సంస్థ పేటీఎం తాజాగా ఏప్రిల్‌ 17 నుంచి 19 మధ్య ట్రావెల్‌ సేల్‌ ఆఫర్లను ప్రకటించింది. బస్‌ టికెట్ల చార్జీలపై 25 శాతం డిస్కౌంటు అందించనున్నట్లు తెలిపింది. అలాగే రూ. 3,000 వరకు క్యాష్‌బ్యాక్, 1 బస్‌ టికెట్‌ కొంటే 1 టికెట్‌ ఉతం వంటి ఆఫర్లను కూడా పొందేందుకు అవకాశం ఉందని పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ వివరింంది. 2,500 పైలుకు బస్‌ ఆపరేటర్ల నుంచి తక్కువ చార్జీలకే టికెట్లు పొందవచ్చని తెలిపింది.

మరిన్ని వార్తలు