రూ.3,717 కోట్లను సమీకరించిన ఎస్‌బీఐ

9 Mar, 2023 06:11 IST|Sakshi

ముంబై: ఎస్‌బీఐ అడిషనల్‌ టైర్‌ 1 (ఏటీ1) బాండ్ల జారీ ద్వారా రూ.3,717 కోట్లను సమీకరించినట్టు ప్రకటించింది. 8.25 శాతం కూపన్‌ రేటు (వడ్డీ రేటు)పై ఈ బాండ్లను జారీ చేసినట్టు తెలిపింది. ఈ నిధులతో ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో బలపడుతుందని పేర్కొంది.

పదేళ్ల తర్వాత కాల్‌ ఆప్షన్‌తో వీటిని జారీ చేసినట్టు ప్రకటించింది. ఈ ఇష్యూకి అధిక స్పందన వచ్చిందని, ప్రావిడెంట్‌ ఫండ్, పెన్షన్‌ ఫండ్, ఇన్సూరెన్స్‌ కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపించాయని వెల్లడించింది. రూ.2,000 కోట్ల బేస్‌ ఇష్యూకి గాను, 2.27 రెట్లు బిడ్లు వచ్చాయని (రూ.4,537 కోట్లు) ఎస్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది. 

>
మరిన్ని వార్తలు