జోయాలుక్కాస్‌ చైర్మన్‌కు ప్రత్యేక పురస్కారం

9 Oct, 2023 06:19 IST|Sakshi

హైదరాబాద్‌: జోయాలుక్కాస్‌ గ్రూప్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జాయ్‌ అలుక్కాస్‌ ప్రపంచ జ్యువెలరీ సమాఖ్య నుంచి ప్రత్యేక పురస్కారం అందుకున్నారు. వర్డల్‌ జ్యువెలరీ కానె్ఫడరేషన్‌(సీఐబీజేఓ) జైపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ 2023  కార్యక్రమంలో సంస్థ ఎండీ జాన్‌ పాల్‌ అలుక్కాస్‌.. చైర్మన్, ఎండీ జాయ్‌ అలుక్కాస్‌ తరఫున ఈ గౌరవాన్ని స్వీకరించారు.

సప్లై చైన్‌లో నైతిక పద్ధతులు, సుస్థిరతలకు సాటిలేని కృషిని వరల్డ్‌ జ్యువెలరీ కాన్ఫెడరేషన్‌ గుర్తించింది. ‘‘ఈ గుర్తింపును మా సంస్థలో ప్రతి ఒక్క సభ్యునితో భాగస్వామ్యం చేస్తున్నాను’’ అని జాయ్‌అలుక్కాస్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు