రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

25 Sep, 2020 18:54 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్‌ ట్యాంకర్‌ను ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. తాళ్లరేవు బైపాస్‌ రోడ్డుపై ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తాళ్లరేపు బైపాస్‌ రోడ్డు మీద వెళుతున్న ఓ ఆటో ప్రమాదవశాత్తు ముందున్న ఆయిల్‌ ట్యాంక్‌ను ఢీకొంది. దీంతో ఆటో నుజ్జునుజ్జయి అందులోని ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మృతుల్లో కాకినాడ శారదాదేవి టెంపుల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు అంధులు ఉండగా.. మరొకరు ఆటో డ్రైవర్. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

చదవండి : హేమంత్‌ హత్య: కారులో చిత్రహింసలు

మరిన్ని వార్తలు