లక్నో: ఉత్తర ప్రదేశ్లోని గోండా జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. టీక్రీ అనే గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి రెండు ఇళ్లు శిథిలమయ్యాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా..మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న 14 మందిని రక్షించారని పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని కోసం సహాయక చర్యలు జరుగుతున్నట్టు తెలిపారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు. బాధితుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.