ఎంత కష్టం వచ్చిందో కుటుంబం మొత్తం .....

24 Mar, 2021 14:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పశ్చిమ గోదావరిఆ కుటుంబంలో ఏం జరిగిందో తెలీదు గానీ వారంతా పురుగుల మందు తాగి  ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దారుణం దెందులూరులో చోటుచేసుకుంది.. దెందులూరు మండలం సింగవరం లో నివసిస్తున్న భార్యాభర్తలు వెంకట నారాయణ, కృష్ణ తులసి , వారి కొడుకు భాను వికాస్ తమ పంట పొలాల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకునే లోపే అక్కడ తండ్రి చనిపోగా, కొన ఉపిరితో ఉన్న కుమారుడుని, అతని భార్యని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే లోపే కొడుకు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం కృష్ణ తులసికి వైద్యులు చికిత్స చేస్తున్నారు.

( చదవండి : పెద్దల్ని ఎదిరించి ప్రేమ పెళ్లి, నాలుగు నెలలకే..)

మరిన్ని వార్తలు