యువతి జుట్టు రాలిపోతోందని.. ఇంట్లో ఎవరూ లేనప్పుడు..

3 Jul, 2022 14:55 IST|Sakshi

మైసూరు(బెంగళూరు): తలలో జుట్టు రాలిపోతోందని ఆవేదన చెందిన యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైసూరులో జరిగింది. రాఘవేంద్ర నగర లేఔట్‌లో నివాసం ఉంటున్న కావ్యశ్రీ (22) మృతురాలు. కొన్నిరోజులుగా ఆమెకు జుట్టు ఊడిపోతోంది. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. జుట్టు లేకపోతే అందరూ చిన్నచూపు చూస్తారని కుమిలిపోయింది. దీంతో ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. నజరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

చదవండి: తండ్రి కొడుకుల ఘాతుకం...మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి...

మరిన్ని వార్తలు