Thiruvallur: 20 నిమిషాల పాటు ఫోన్‌లో.. రైలుకు ఎదురెళ్లి..

6 Feb, 2022 06:35 IST|Sakshi
దివ్య (ఫైల్‌)   

చెన్నై: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరువళ్లూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పుట్లూరుకు చెందిన దివ్య(30) బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తోంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో మనస్పర్థలు రావడంతో రెండు వారాల నుంచి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 9 గంటలకు పార్లర్‌ను మూసివేసి పుట్లూరులోని ఇంటికి బయలుదేరింది. రైల్వేట్రాక్‌ వద్ద సుమారు 20 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడింది. ఎక్స్‌ప్రెస్‌ రైలు వస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై ఎదురుగా వెళ్లింది. రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: (చిన్నారిపై ఉపాధ్యాయుడి ఆత్యాచారాయత్నం.. బాలిక వీపుపై..)

మరిన్ని వార్తలు