Rangareddy: అత్యాచార నిందితుడికి ఉరిశిక్ష

9 Feb, 2021 15:40 IST|Sakshi

రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు

సాక్షి, రంగారెడ్డి‌: రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అత్యాచారానికి పాల్పడిన మృగాడికి ఉరిశిక్ష విధించింది. వివరాలు.. దినేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి మూడేళ్ల క్రితం నార్సింగి ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేయడమే కాక హత్య చేశాడు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి కోర్టు మంగళవారం నిందితుడు దినేశ్‌ కుమార్‌కు ఉరిశిక్ష విధిస్తూ.. తీర్పు వెల్లడించింది. 

2017లో చోటు చేసుకున్న ఈ దారుణంలో నిందితుడు దినేశ్‌ కుమార్‌ ఆరేళ్ల చిన్నారిని లేబర్ క్యాంప్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ పాపను హత్య చేశాడు. సంచలన సృష్టించిన ఈ కేసును సైబరాబాద్‌ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడికి ఈ కేసుతో సంబంధం ఉందని నిరూపించే సాక్ష్యాలు సంపాదించి కోర్టుకు సమర్పించారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా ట్రయల్స్‌ నిర్వహించారు. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు దినేశ్‌ కుమార్‌ను దోషిగా తేల్చి.. ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 

చదవండి: 8 ఏళ్ల చిన్నారి గొంతు కోసి.. పళ్లు రాలగొట్టి..

మరిన్ని వార్తలు