కామాంధుడిని అరెస్ట్‌ చేసిన సరూర్‌ నగర్‌ పోలీసులు

2 Nov, 2020 20:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మూగ జీవిపై అఘాయిత్యానికి పాల్పడి జైలు పాలయ్యాడో కామాంధుడు. ఈ సంఘటన హైదరాబాద్లోని సరూర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజయ్‌ వర్మ అనే వ్యక్తి ఎల్బీనగర్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఓ ఆవు దూడపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సరూర్‌ నగర్‌ పోలీసులు  సంజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడ్ని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు