విషాదం: పెళ్లి విందులో భోజనం తిని..

23 Nov, 2021 07:01 IST|Sakshi

సాక్షి, శివమొగ్గ: పెళ్ళి విందులో భోజనం ఆరగించి పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ) ప్రాణాలు కోల్పోయారు. మృతుడు శివమొగ్గ తాలూకాలోని ఆరికెరె గ్రామా పంచాయతీకి చెందిన పిడిఓ దినేష్‌సింగ్‌ (42). ఈ నెల 17న అరదోట్లు గ్రామంలో ఒక పెళ్లిలో ఆయన భోజనం తిన్నారు. వెంటనే వాంతులు, విరేచనాలతో పాటు చలి జ్వరం వచ్చాయి. దాంతో కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స కోసం అస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విందులో ఆహారం తిన్న అనేకమందికి కూడ వాంతులు, విరేచనాలు అయ్యాయి. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. 

చదవండి: (వాహనంతో ఢీకొట్టి ఎంవీఐ హత్య.. రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియో: సీఎం) 

చదవండి: (‘వేడుకున్నా కనికరించలేదు’.. అందుకే ఆ ఎస్‌ఐని చంపేశాం..)

మరిన్ని వార్తలు