గతేడాది నుంచి ప్రేమించుకుంటున్న సునీత, శ్రీనివాస్‌.. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో..

14 Dec, 2021 15:45 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ప్రేమించిన యువకుడితో పెళ్లికి అతడి కుటుంబీకులు నిరాకరించడంతో పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని ఖండాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై హరిబా బు తెలిపిన వివరాలు.. ఖండాల గ్రామానికి చెందిన చౌహాన్‌ సునీత (20), శ్రీనివాస్‌ గతేడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. శ్రీనివాస్‌ కుటుంబీకులు పెళ్లికి నిరాకరించడంతో సునీత ఆదివారం ఇంట్లో పురుగులు మందు తాగింది. గమనించిన కుటుంబీకులు రిమ్స్‌ కు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో శ్రీనివాస్‌తోపాటు పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.  

మరిన్ని వార్తలు