గుంటూరు వెస్ట్ (క్రీడలు): రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక జరిగిందని అసోసియేషన్ ఫౌండర్ మెంబర్ పి.థామస్ చౌదరని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యక్ష, కార్యదర్శులుగా చిలుకూరి నీలిమ, పొనిగేటి శ్రీకాంత్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా ఎం.సురేష్, ఉపాధ్యక్షులుగా షేక్ మస్తాన్, ప్రసాద్, కోశాధికారిగా జాస్తి హరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. ఎన్నికల పరిశీలకులుగా శాప్ నుంచి చీఫ్ కోచ్ జి.వెంకటేశ్వర రావు, జిల్లా ఒలింపిక్ అద్యక్షులు చల్లా వెంకటేశ్వర రెడ్డి వ్యవహరించారని చెప్పారు.