ఇంటికే రామయ్య తలంబ్రాలు

21 Mar, 2023 01:04 IST|Sakshi

హన్మకొండ: శ్రీరామ నవమి రోజు జరిగే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేరవేయనున్నట్లు తపాలా శాఖ హనుమకొండ డివిజన్‌ సూపరింటెండెంట్‌ బి.నంద ఒక ప్రకటనలో తెలిపారు. తపాలా శాఖ భక్తుల కోసం ప్రత్యేకంగా సేవా కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. స్పీడ్‌ పోస్టు ద్వారా 10 గ్రాముల తలంబ్రాలు, 2 ముత్యాలు, పసుపు, కుంకుమ, మిస్రీ, కాజు ప్రసాదం ఇంటికే పంపనున్నట్లు తెలిపారు. ఇందుకోసం భక్తులు సమీపంలోని పోస్టాఫీసులో ఈనెల 28వ తేదీలోపు రూ.450 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. 20 గ్రాముల తలంబ్రాలు, 2 ముత్యాలను రూ.150 చెల్లించి ఆన్‌లైన్‌ ద్వారా సేవలు పొందవచ్చని తెలిపారు.

మరిన్ని వార్తలు