హైదరాబాద్‌

18 Nov, 2023 06:42 IST|Sakshi
ఒకటికి వందసార్లు ఆలోచించాలి

ఓటు అనేది చాలా పవర్‌ఫుల్‌. చాలా బాధ్యతాయుతమైనది. ఇంట్లో తల్లిదండ్రుల్లా, పాఠశాలలో ఉపాధ్యాయుల్లా.. మన దేశానికి ప్రజా ప్రతినిధులు, పార్టీలు అవసరం. ప్రతి ఒక్కరూ తమ శక్తి మేర మంచి చేస్తున్నారు. ఓటు అనే హక్కుని మనం ఉపయోగించుకోవాలి. ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించుకునే బలమైన ఆయుధం ఓటు. మనకు మంచి చేసే వ్యక్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మనకు, మన కుటుంబానికి, మన దేశానికి, మన భవిష్యత్తుకు ఏది మంచిది అని ఒకటికి వందసార్లు ఆలోచించి ఓటును ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓటుని బాధ్యతగా భావించి మంచి వారిని ఎన్నుకోవాలి.

– శివానీ రాజశేఖర్‌, ‘అద్భుతం’ హీరోయిన్‌

సెలబ్రిటీ కామెంట్‌

శనివారం శ్రీ 18 శ్రీ నవంబర్‌ శ్రీ 2023

మరిన్ని వార్తలు